ఫిలిప్పీన్స్లోని ఓ జైలుపై సాయుధులు దాడి..
- January 04, 2017
దక్షిణ ఫిలిప్పీన్స్లోని ఓ జైలుపై సాయుధులు దాడి చేయడంతో 150 మంది ఖైదీలు పరారయ్యారు. దాడికి పాల్పడిన సాయుధులు ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు భావిస్తున్నారు. మిందనావో ద్వీపంలోని నార్త్ కొటబాటొ జిల్లా జైలును పెద్ద సంఖ్యలో సాయుధులు చుట్టుముట్టి గార్డులు, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో జైలులోని ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. కాల్పుల్లో ఒక గార్డు ప్రాణాలు కోల్పోగా మరో ఖైదీ గాయపడినట్లు తెలుస్తోంది. జైలులో 1500 మంది ఖైదీలు ఉన్నారని, రెండు గంటల పాటు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. .
కాథలిక్ క్రైస్తవులు ఎక్కువగా ఉండే దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతం దశాబ్దాలుగా వేర్పాటువాదులతో పోరాడుతోంది.
జైలులో ఉన్న ఇస్లామిస్ట్ తీవ్రవాదులను విడిపించుకోవడం కోసమే ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిలిప్పీన్స్లో గత దశాబ్ద కాలంలో జైళ్లపై దాడిచేసి ఖైదీలను విడిపించుకున్న ఘటనల్లో ఇది మూడో అతి పెద్ద ఘటన.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







