ఫిలిప్పీన్స్‌లోని ఓ జైలుపై సాయుధులు దాడి..

- January 04, 2017 , by Maagulf
ఫిలిప్పీన్స్‌లోని ఓ జైలుపై సాయుధులు దాడి..

దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని ఓ జైలుపై సాయుధులు దాడి చేయడంతో 150 మంది ఖైదీలు పరారయ్యారు. దాడికి పాల్పడిన సాయుధులు ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు భావిస్తున్నారు. మిందనావో ద్వీపంలోని నార్త్‌ కొటబాటొ జిల్లా జైలును పెద్ద సంఖ్యలో సాయుధులు చుట్టుముట్టి గార్డులు, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో జైలులోని ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. కాల్పుల్లో ఒక గార్డు ప్రాణాలు కోల్పోగా మరో ఖైదీ గాయపడినట్లు తెలుస్తోంది. జైలులో 1500 మంది ఖైదీలు ఉన్నారని, రెండు గంటల పాటు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. .
కాథలిక్‌ క్రైస్తవులు ఎక్కువగా ఉండే దక్షిణ ఫిలిప్పీన్స్‌ ప్రాంతం దశాబ్దాలుగా వేర్పాటువాదులతో పోరాడుతోంది.

జైలులో ఉన్న ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులను విడిపించుకోవడం కోసమే ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో గత దశాబ్ద కాలంలో జైళ్లపై దాడిచేసి ఖైదీలను విడిపించుకున్న ఘటనల్లో ఇది మూడో అతి పెద్ద ఘటన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com