మోసానికి పాల్పడ్డ భారత వ్యాపారవేత్త దుబాయ్ లో అరెస్ట్....

- January 05, 2017 , by Maagulf
మోసానికి పాల్పడ్డ భారత వ్యాపారవేత్త దుబాయ్ లో  అరెస్ట్....

పెట్టుబడిదారుల డబ్బుని రెట్టింపు ఇస్తానని వాగ్దానం చేసిన దుబాయికి చెందిన విదేశీ మార్పిడి వ్యాపార సంస్జకు చెందిన భారతీయ యజమానిని మోసం చేస్తున్నాడని అనుమానంకలగడంతో ఎమిరేట్ లో అరెస్టు చేశారు గోవా కు చెందిన సిడ్నీ లెమోస్ (36), ను గత నెల డిసెంబర్ 21 తేదీన అరెస్టు చేశారు. ఈ వ్యక్తి  50 మిలియన్ దిర్హాములు (13.6 మిలియన్ డాలర్ల) విలువైన పెట్టుబడి విఫలమైన వెనుక మోసం దాగి ఉందని తెలుస్తుంది. గత ఏడాది జూలైలో దుబాయ్ అధికారులు ఎగ్జిన్తియా గ్రూప్ సంస్థని  మూసివేశారు వారి పెట్టుబడులను 100 శాతం తిరిగి ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఆ తర్వాత ఆ సంస్థ యజమాని తనతో ఇక చెల్లించలేనని చెప్పినప్పుడు ఖాతాదారులు తాము మిలియన్ల దిర్హాములు కోల్పోయినట్లు లబోదిబో మంటూ గగ్గోలు పెట్టారు. దుబాయ్ పోలీసు ప్రతినిధి ఈ ఘటనకు సంబంధించి నిర్ధారించడానికి లేదా నివేదిక పై తిరస్కరించడానికి ఎటువంటి స్పందన చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com