గల్ఫ్కు తరలిస్తున్న గంజాయి పట్టివేత....
- January 05, 2017
రాజంపేట టౌన్(కడప) : గల్ఫ్దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంభందించి డీఎస్పీ రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామానికి చెందిన సురేష్కుమార్, చిత్తూరు జిల్లా తట్టివేడు మండలం సి.పి.ఎన్.కండ్రికకు చెందిన వెంకటేశ్వర్లును మన్నూరు సీఐ హేమ సుందర్రావు పోలీస్ సిబ్బందితో దేవసముద్రం ఆంజనేయ విగ్రహం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 3కేజీల గంజాయి ఉండ టంతో వారిని పట్టుకొని అరెస్ట్ చేశామని, వారు కువైత్లోని స్మగ్లర్లకు, గల్ఫ్దేశాల స్మగ్లర్లకు ఈ గంజాయిని సరఫరా చేసేవారన్నారు. అలాగే 3వ తేదీన మన్నూరు స్టేషన్ పరిధిలో 6.2 కేజీల గంజాయి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
గంజాయి, మాదకద్ర వ్యాలు కలిగిన ఉన్న వారిపై అక్రమరవాణా చేసేవారిపై స్మగ్లర్లపై ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘాను ఉంచి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









