గల్ఫ్కు తరలిస్తున్న గంజాయి పట్టివేత....
- January 05, 2017
రాజంపేట టౌన్(కడప) : గల్ఫ్దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంభందించి డీఎస్పీ రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామానికి చెందిన సురేష్కుమార్, చిత్తూరు జిల్లా తట్టివేడు మండలం సి.పి.ఎన్.కండ్రికకు చెందిన వెంకటేశ్వర్లును మన్నూరు సీఐ హేమ సుందర్రావు పోలీస్ సిబ్బందితో దేవసముద్రం ఆంజనేయ విగ్రహం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 3కేజీల గంజాయి ఉండ టంతో వారిని పట్టుకొని అరెస్ట్ చేశామని, వారు కువైత్లోని స్మగ్లర్లకు, గల్ఫ్దేశాల స్మగ్లర్లకు ఈ గంజాయిని సరఫరా చేసేవారన్నారు. అలాగే 3వ తేదీన మన్నూరు స్టేషన్ పరిధిలో 6.2 కేజీల గంజాయి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
గంజాయి, మాదకద్ర వ్యాలు కలిగిన ఉన్న వారిపై అక్రమరవాణా చేసేవారిపై స్మగ్లర్లపై ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘాను ఉంచి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







