బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా

- January 06, 2017 , by Maagulf
బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిరిండియా

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సంచలన ఆఫర్‌ ప్రకటించింది. మూణ్నెళ్ల కాలపరిమితిపై టిక్కెట్లు బుక్‌ చేసుకొనేవారికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో సెకండ్‌ ఏసీ టికెట్‌తో సమానంగా విమాన టికెట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు రూ.1080 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇది శుక్రవారం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. జనవరి 6 నుంచి ఏప్రిల్‌ 10 మధ్య తీసుకున్న టికెట్లతో జనవరి 26 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిరిండియా వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌లైన్‌ టికెట్‌ విక్రయ కేంద్రాలు, ట్రావెల్‌ ఏజెంట్ల వద్ద కూడా ఈ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com