ఏమి ఈ ఘోర కలి!
- January 06, 2017
బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలో గల ఓ జైల్లో ఘర్షణ జరిగి 33 మంది ఖైదీలు మరణించారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం ఇదే దేశంలోని మరో జైల్లో జరిగిన ఘోర దుర్ఘటనలో 56 మంది ఖైదీలు మరణించిన ఘటనను ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో దారుణం జరగడం గమనార్హం.
రోరైమా రాష్ట్రంలోని అతిపెద్ద జైల్లో తాజా దుర్ఘటన జరిగింది. బ్రెజిల్ జైళ్ల వ్యవస్థను ఎక్కువగా గ్యాంగులే నియంత్రిస్తుంటాయని, అందువల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు చోటుచేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు కూడా డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదమే గొడవకు కారణమని తెలుస్తోంది. రెండు వేర్వేరు క్రిమినల్ గ్యాంగులకు చెందిన ఖైదీల మధ్య గొడవ జరిగి, ఒకరినొకరు నరికి చంపుకుంటున్న ఘటనలు అక్కడ తరచు చోటుచేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







