తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ....
- January 09, 2017
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీటి కేటాయింపుల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకే సెక్షన్ 89ని చట్టంలో చేర్చారని, ట్రిబ్యునల్ దానికి ప్రాధాన్యతలేదని తోసిపుచ్చిందని విన్నవించారు. అయితే ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదానికి సెక్షన్ 84, ఎఫెక్స్ కౌన్సిల్ ఉన్నాయని వ్యాఖ్యానించిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.అటు ఏపీ విభజన చట్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమని, మహారాష్ట్ర, కర్నాటకలు వాదించాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







