శ్రీమంతుడి తగిన సోదరి శ్రీమంతురాలనిపించుకుంది
- September 11, 2015
శ్రీమంతుడి తగిన సోదరి శ్రీమంతురాలనిపించుకుంది. టాలీవుడ్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో గల్లా పద్మావతి ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అంతేగాకుండా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి తాను కూడా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించింది. అంతకుముందు మహేష్ బాబు పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణలోని ఓ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు. తాజాగా ప్రిన్స్ సోదరి పద్మావతి కూడా గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామం దత్తత కోసం ఆమె ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోగా, గ్రామాభివృద్ధి కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంతేగాకుండా, పద్మావతి నిర్ణయం పట్ల కంచర్లపాలెం వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇక గుంటూరులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడమే కాకుండా మరుసటి రోజే ఆ గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









