శ్రీమంతుడి తగిన సోదరి శ్రీమంతురాలనిపించుకుంది
- September 11, 2015
శ్రీమంతుడి తగిన సోదరి శ్రీమంతురాలనిపించుకుంది. టాలీవుడ్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో గల్లా పద్మావతి ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అంతేగాకుండా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి తాను కూడా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించింది. అంతకుముందు మహేష్ బాబు పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణలోని ఓ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు. తాజాగా ప్రిన్స్ సోదరి పద్మావతి కూడా గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామం దత్తత కోసం ఆమె ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోగా, గ్రామాభివృద్ధి కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంతేగాకుండా, పద్మావతి నిర్ణయం పట్ల కంచర్లపాలెం వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇక గుంటూరులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించడమే కాకుండా మరుసటి రోజే ఆ గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







