ఆంధ్ర - సింగపూర్ మధ్య కీలక ఒప్పందం
- January 09, 2017
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ను ఏపి సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏపి ప్రభుత్వం మరో ముందడగు వేస్తూ సింగపూర్ సంస్ధలతో కీలక ఒప్పందం చేసుకుంది. గుజరాత్ తర్వాత ఈ తరహా ఒప్పందాన్ని చేసుకున్న ఘనత ఏపిదే. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. సాంకేతిక అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఏపి సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.పురపాలక శాఖా మంత్రి నారాయణ సమక్షంలో సీఆర్డీఏ, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు.
అమరావతి నిర్మాణంలో టెక్నాలజీ సహాయంతో మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనలు కల్పించటమే ఈ కీలక ఒప్పందం లక్ష్యం. అర్బన్ డవలప్మెంట్, అమరావతి స్మార్ట్ సిటీ రూపకల్పనలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహించనుంది. అమరావతి నగరంలో అండర్గ్రౌండ్ కేబులింగ్,డ్రైనేజీలకు సంబంధించి మెరుగైన సాంకేతిక వ్యవస్ధ ఏర్పడేందుకు ఈ MOU ఉపయోగపడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. కేవలం సాంకేతికత మాత్రమే కాదు ఆర్ధికంగా కూడా తోడ్పాడు అందించేందుకు సింగపూర్ సుముఖత వ్యక్తం చేసింది. ఇక నెల 26నాటికి అసెంబ్లీ నిర్మాణ పనులు పూర్తవుతాయని నారాయణ తెలిపారు. సమావేశాల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







