మక్కా గ్రాండ్ మసీదు పై కూలిన క్రేన్ - 107 కు చేరిన మృతుల సంఖ్య
- September 11, 2015
ఇస్లామీయుల పవిత్ర నగరమైన మక్కా లో నిన్న రాత్రి గ్రాండ్ మసీదు పై క్రేన్ పతనమవడం వల్ల కాబా చుట్టూ చేరి ప్రార్ధనలు జరుపుతున్న, మౌంట్ శాఫా మరియు మార్వాల మధ్య ప్రయాణిస్తున్న భక్తులపై మసీదు పైభాగం కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 107 కు పెరగగా, 200 మంది గాయపడ్డారు. ఈ శుక్రవారం మక్కా రీజియన్ గవర్నర్ - ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైజల్ హుటాహుటిన మసీదుకు తరలి వెళ్ళి, సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షపాతం వలన ఈ ప్రాంతంలో చెట్లు సమూలంగా పెకిలించబడ్దాయని, క్రేన్లు దెబ్బతిన్నాయని, మృతి చెందిన వారిని, గాయపడ్డ ప్రతి ఒక్కరినీ ఆసు పత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ఆధారిటీ డైరక్టర్ జనరల్ సులేమాన్ అల్ అమీర్ తెలిపారు. గాయపడినవారు ఏ దేశస్తులు అనే విషయం తెలియరానప్పటికీ, వారి లో 15 మంది ఇరానీయులని ప్రకటించారు. శుక్రవారం నాటికి రాజ్యంలోకి 8,00,000 మంది హజ్ యాత్రీకులు వచ్చి ఉన్నారని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!







