మక్కా గ్రాండ్ మసీదు పై కూలిన క్రేన్ - 107 కు చేరిన మృతుల సంఖ్య
- September 11, 2015
ఇస్లామీయుల పవిత్ర నగరమైన మక్కా లో నిన్న రాత్రి గ్రాండ్ మసీదు పై క్రేన్ పతనమవడం వల్ల కాబా చుట్టూ చేరి ప్రార్ధనలు జరుపుతున్న, మౌంట్ శాఫా మరియు మార్వాల మధ్య ప్రయాణిస్తున్న భక్తులపై మసీదు పైభాగం కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 107 కు పెరగగా, 200 మంది గాయపడ్డారు. ఈ శుక్రవారం మక్కా రీజియన్ గవర్నర్ - ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైజల్ హుటాహుటిన మసీదుకు తరలి వెళ్ళి, సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షపాతం వలన ఈ ప్రాంతంలో చెట్లు సమూలంగా పెకిలించబడ్దాయని, క్రేన్లు దెబ్బతిన్నాయని, మృతి చెందిన వారిని, గాయపడ్డ ప్రతి ఒక్కరినీ ఆసు పత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ఆధారిటీ డైరక్టర్ జనరల్ సులేమాన్ అల్ అమీర్ తెలిపారు. గాయపడినవారు ఏ దేశస్తులు అనే విషయం తెలియరానప్పటికీ, వారి లో 15 మంది ఇరానీయులని ప్రకటించారు. శుక్రవారం నాటికి రాజ్యంలోకి 8,00,000 మంది హజ్ యాత్రీకులు వచ్చి ఉన్నారని అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ









