మక్కా గ్రాండ్ మసీదు పై కూలిన క్రేన్ - 107 కు చేరిన మృతుల సంఖ్య

- September 11, 2015 , by Maagulf
మక్కా గ్రాండ్ మసీదు పై కూలిన క్రేన్ - 107 కు చేరిన మృతుల సంఖ్య

ఇస్లామీయుల పవిత్ర నగరమైన మక్కా లో నిన్న రాత్రి గ్రాండ్ మసీదు  పై క్రేన్ పతనమవడం వల్ల కాబా చుట్టూ చేరి ప్రార్ధనలు జరుపుతున్న, మౌంట్ శాఫా మరియు మార్వాల మధ్య ప్రయాణిస్తున్న భక్తులపై మసీదు పైభాగం కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 107 కు పెరగగా, 200 మంది గాయపడ్డారు. ఈ శుక్రవారం మక్కా రీజియన్ గవర్నర్ - ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైజల్ హుటాహుటిన మసీదుకు తరలి వెళ్ళి, సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షపాతం వలన ఈ ప్రాంతంలో చెట్లు సమూలంగా పెకిలించబడ్దాయని, క్రేన్‌లు దెబ్బతిన్నాయని, మృతి చెందిన వారిని, గాయపడ్డ ప్రతి ఒక్కరినీ ఆసు పత్రులకు తరలించామని సివిల్ డిఫెన్స్ ఆధారిటీ డైరక్టర్ జనరల్ సులేమాన్ అల్ అమీర్ తెలిపారు. గాయపడినవారు ఏ దేశస్తులు అనే విషయం  తెలియరానప్పటికీ, వారి లో 15 మంది ఇరానీయులని ప్రకటించారు. శుక్రవారం నాటికి రాజ్యంలోకి 8,00,000 మంది హజ్ యాత్రీకులు వచ్చి ఉన్నారని అదికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com