యదార్ధ సంఘటనల ఆధారంగా రానున్న 'రంగు'

- January 14, 2017 , by Maagulf
యదార్ధ సంఘటనల ఆధారంగా రానున్న 'రంగు'

బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకుని 'నచ్చావులే' చిత్రంతో కథానాయకుడిగా మారాడు తనీష్‌. ఆ తర్వాత 'రైడ్‌', 'ఏం పిల్లో ఏం పిల్లడో' తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ నటుడు మరో కొత్త చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధమైంది. కార్తికేయ దర్శకత్వంలో తనీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగు'. సినీవాలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌ సంభాషణలు అందించగా, యోగీశ్వర్‌ శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com