యదార్ధ సంఘటనల ఆధారంగా రానున్న 'రంగు'
- January 14, 2017
బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకుని 'నచ్చావులే' చిత్రంతో కథానాయకుడిగా మారాడు తనీష్. ఆ తర్వాత 'రైడ్', 'ఏం పిల్లో ఏం పిల్లడో' తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ నటుడు మరో కొత్త చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధమైంది. కార్తికేయ దర్శకత్వంలో తనీష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగు'. సినీవాలీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఫస్ట్లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా, యోగీశ్వర్ శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







