'జై.. లవ..కుశ..' గా రానున్న ఎన్టీఆర్.!
- January 15, 2017
ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకూ అభిమానుల్లో చర్చ నడుస్తూనే ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడి చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా సీకే మురళీధరన్ను చిత్రబృందం ఇటీవల ఎంపిక చేసింది. గతంలో ఈయన బాలీవుడ్ చిత్రాలు 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'మొహెంజొదారో' చిత్రాలకు పనిచేశారు. ఇక ఎన్టీఆర్ తాజా చిత్రానికి 'జై.. లవ..కుశ..' అనే పేరు పరిశీలనలో ఉంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







