దుబాయ్ ట్యాక్సీ స్మార్ట్ కార్ రికవరీ ప్రాజెక్ట్
- January 16, 2017
ఆర్టిఎ - దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), అరేబియన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (ఎఎఎ)తో కలిసి ఓ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. స్మార్ట్ కార్ రికవరీ సిస్టమ్ కోసం రోడ్సైడ్ సర్వీసెస్ని అందించడంలో ఎఎఎ సంస్థ మేటి. ఈ ఒప్పందం ప్రకారం స్మార్ట్ కార్ రికవరీ సిస్టమ్ ఈ మార్చ్లో ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో వాహనానికి సమస్య తలెత్తితే, స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారానే 'సర్వీస్' పొందడానికి వీలవుతుందని డిటిసి, ఎఎఎ వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఎ హెడ్ ఆఫీస్లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో డిటిసి సిఇఓ డాక్టర్ యూసఫ్ మొహమ్మద్, అలాగే ఎఎఎ ఛైర్మన్ మొహమ్మద్ బిన్ సులేయెమ్ పాల్గొని, ఒప్పందాలపై సంతకాలు చేశారు. 10 లీటర్ల వరకు ఫ్యూయెల్ని అందించడం, టైర్ రిపెయిర్, సాధారణ మెకానికల్ సమస్యలు, టెక్నికల్ వర్క్ షాప్ వద్దకు వాహనాల్ని తరలించడం వంటివి ఈ అసిస్టెన్స్ ద్వారా వాహనదారులకు లభిస్తాయి. ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వాహనదారులు కూడా అభిప్రాయపడుతుండడం జరుగుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







