దుబాయ్ ట్యాక్సీ స్మార్ట్ కార్ రికవరీ ప్రాజెక్ట్
- January 16, 2017
ఆర్టిఎ - దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి), అరేబియన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (ఎఎఎ)తో కలిసి ఓ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. స్మార్ట్ కార్ రికవరీ సిస్టమ్ కోసం రోడ్సైడ్ సర్వీసెస్ని అందించడంలో ఎఎఎ సంస్థ మేటి. ఈ ఒప్పందం ప్రకారం స్మార్ట్ కార్ రికవరీ సిస్టమ్ ఈ మార్చ్లో ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో వాహనానికి సమస్య తలెత్తితే, స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారానే 'సర్వీస్' పొందడానికి వీలవుతుందని డిటిసి, ఎఎఎ వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఎ హెడ్ ఆఫీస్లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో డిటిసి సిఇఓ డాక్టర్ యూసఫ్ మొహమ్మద్, అలాగే ఎఎఎ ఛైర్మన్ మొహమ్మద్ బిన్ సులేయెమ్ పాల్గొని, ఒప్పందాలపై సంతకాలు చేశారు. 10 లీటర్ల వరకు ఫ్యూయెల్ని అందించడం, టైర్ రిపెయిర్, సాధారణ మెకానికల్ సమస్యలు, టెక్నికల్ వర్క్ షాప్ వద్దకు వాహనాల్ని తరలించడం వంటివి ఈ అసిస్టెన్స్ ద్వారా వాహనదారులకు లభిస్తాయి. ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వాహనదారులు కూడా అభిప్రాయపడుతుండడం జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









