పారాలింపిక్స్‌ విజేతలకు నగదు బహుమతులు..

- January 18, 2017 , by Maagulf
పారాలింపిక్స్‌ విజేతలకు నగదు బహుమతులు..

 దుబాయ్‌లో ఉంటున్న భారత వ్యాపారవేత్త ముక్కత్తు సెబాస్టియన్‌ పారాలింపిక్స్‌-2016 విజేతలకు నగదు పురస్కారాలు ప్రకటించారు. జావెలిన్‌ త్రో, హైజంప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన దేవేంద్ర ఝఝారియా, తంగవేల్‌ మారియప్పన్‌కు రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించారు. మహిళల షాట్‌పుట్‌లో రజతం కైవసం చేసుకొన్న దీపా మలిక్‌కు రూ.3 లక్షలు, హైజంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్‌సింగ్‌ భాటికి రూ.2 లక్షలు అందజేస్తారు. త్రివేండ్రంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ జనవరి 20న ఈ పురస్కారాలను అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com