జాతీయ గీత ఆలాపనలో అరుదైన రికార్డు
- January 21, 2017
ఓ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలో భక్తి పరవశంతో పాటు జాతీయ భావం వెల్లివిరిసింది. 3.5 లక్షలకు పైగా మంది ప్రజలంతా ఒకేవేదికపైకి వచ్చి ఆలపించిన జాతీయ గీతం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటుదక్కించుకుంది. గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా కాగ్వాడ్ లో కొత్తగా నిర్మించిన కోడల్ ధామ్ దేవాలయంలో కొడియార్ దేవత విగ్రహ ప్రతిష్ట సమయంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్న 3.5 లక్షలకు పైగా మంది జాతీయగీతం ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు కోడల్ ధామ్ దేవాలయ ట్రస్ట్ సభ్యుడు హన్సరాజ్ గజేరా తెలిపారు.
2014లో బంగ్లాదేశ్ లో 2,54,537 మంది ప్రజలు జాతీయ గీతం ఆలపించి ప్రపంచ రికార్డు సాధించారు.
ప్రస్తుతం ఈ రికార్డును చేధించినట్టు గజేరా పేర్కొన్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారుల నుంచి ప్రపంచ రికార్డు సర్టిఫికేట్ ను పొందామని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 40 కిలోమీటర్ల శోభ యాత్ర, 1008-కుండ్ మహాయగ్న నిర్వహించి ఇప్పటికే ఈ ట్రస్ట్ లిమ్కా బుక్ రికార్డులో చోటు సంపాదించింది. జనవరి 17న ప్రారంభమైన ఐదు రోజుల ఈ వేడుకకు, 50 లక్షలకు పైగా భక్తులు హాజరైనట్టు ట్రస్ట్ పేర్కొంది.
రూ.60 కోట్లతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. టెంపుల్ పరిసర ప్రాంతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీని నిర్మించాలని ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









