'టామ్కామ్' బాసట గల్ఫ్ ఉద్యోగార్థులకు...
- January 22, 2017అర్హులైన అభ్యర్థులను గల్ఫ్ కంపెనీలు ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ 'టామ్కామ్' సహకరిస్తుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గల్ఫ్లో ఉద్యోగాలకు అనువుగా వీలైతే అభ్యర్థులకు తామే శిక్షణ ఇప్పించడానికి కూడ సిద్ధమని ఆయన చెప్పారు. దళారుల ప్రలోభాలతో వృత్తి నైపుణ్యంలేని యువత ఉద్యోగాల కోసం గల్ఫ్కు వస్తుండడంతో అటు యాజమానులతో పాటు రాషా్ట్రనికీ, దేశానికి కూడ ఇబ్బంది, నష్టం కల్గిస్తుందని మంత్రి చెప్పారు. కువైట్లోని భారతీయ ఎంబసీ అవరణలో శనివారం ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు.
కువైతీ యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్ధ ద్వారా నియామకంతో ఖర్చు తగ్గి, అర్హులైన వారిని ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. కువైట్లో 1.2బిలియన్ దినార్లతో ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని, దీనికి నిపుణులపై 50వేల మంది ఉద్యోగ, కార్మికులు అవసరమని కువైటీ ప్రతినిధులు మంత్రితో చెప్పారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న నాయిని శుక్రవారం ఖతర్లోని తెలంగాణ ప్రవాసీ ప్రముఖులను కలిశారు. తెలంగాణ యువతను సురక్షితంగా గల్ఫ్ ఉద్యోగాలలో నియమించేలా 'టామ్కామ్' ద్వారా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వారికి వివరించారు.
ఈ మేరకు మూడు సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రవాసీయులు మంత్రికి సహాయపడ్డారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!