భూకంపం.. సునామీ హెచ్చరిక...
- January 22, 2017
పోర్ట్ మోర్స్బై: పపువా న్యూ గినియా తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. పన్గున ఐలాండ్లో, బౌగన్విల్లే ఐలాండ్లో కొన్ని ప్రాంతాల్లో న్యూగినియాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసున్నాయి. పపువా న్యూ గునియా తీరంలో, సోలమన్ ఐలాండ్, నౌరు, కోస్రే, వనౌతు, ఇండోనేషియాలపై ఈ భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 95.5 మైళ్లు లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఈ దీవులు ఉండటంతో తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. జియోలాజికల్ సర్వే సునామీ వార్నింగ్తో న్యూ గినియా అధికారులు అప్రమత్తమయ్యారు. చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









