గాంధీ మెమోరియల్ని సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- January 26, 2017
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ డిప్యూటీ సూప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ లైద్, మహాత్మాగాంధీ మెమోరియల్ని సందర్శించారు. భారతదేశంలో అధికారిక పర్యటన సందర్భంగా ఢిల్లీలోని మహాత్మాగాంధీ మెమోరియల్ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా రాజ్ ఘాట్ మెమోరియల్లో ఒక నిమిషం పాటు ఆయన మౌనం పాటించి, మహాత్ముడికి నివాళులర్పించారు. మహనీయులు ప్రజల గుండెల్లో, ఆయా దేశాల చరిత్రల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, గెస్ట్ బుక్లో పేర్కొన్నారు. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్, 1975లో భారతదేశ పర్యటన సందర్భంగా భారతదేశంతో ఏర్పరచిన సంబంధాల్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నట్లు తెలిపారాయన. 1975లో పాతిన చెట్టుకి నీళ్ళు పోసి, ఇప్పుడు కొత్తగా మరో మొక్కని అక్కడ నాటడం జరిగింది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు నాటిన మొక్కలున్నాయిక్కడ.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









