879 విదేశీ ఖైదీలు
- January 26, 2017
జెద్దాహ్: పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ప్రిజన్స్లో ఉన్న 5,084 మంది ఖైదీల్లో 829 మంది విదేశీయులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విదేశీ ఖైదీల లిస్ట్లో ఆఫ్ఘనిస్తాన్, అంగోలా, ఇథియోపియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, అల్జీరియా, సుడాన్, సోమాలియా, చైనా, ఇరాక్, ఫిలిప్పీన్స్, మొరాకో, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్, యెమెన్, పాకిస్తాన్, బెల్జియం, బంగ్లాదేశ్, చాద్, టర్కీ, లెబనాన్, మాలి, ఈజిప్ట్, మారిటానియా, పాలస్తీన్, నిగెర్ దేశాలకు చెందినవారితోపాటు ఇంకొందరు కూడా ఉన్నారు. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో యెమెన్కి చెందిన 281 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 217 మందితో సిరియా, 68 మందితో పాకిస్తాన్ ఉన్నాయి. అయితే అరెస్టయినవారంతా క్రిమినల్స్ కాదనీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు అరెస్టయి ఉంటారని, అమాయకులు విడుదల చేయబడ్తారని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్ట్రాటజిక్ ప్లానింగ్ ఆఫీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ బస్సామ్ అతియా చెప్పారు. విదేశీయులు దేశంలోని చట్టాల్ని గౌరవిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









