తొమ్మిది చిత్రాల నిర్మాణం...
- January 27, 2017
తిరుపతి: కొద్దికాలంగా ఫాం కోల్పోయిన స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ తిరిగి పుంజుకునేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. 2017,2018 సంవత్సరాల్లో ఏకకాలంలో ఏకంగా తొమ్మిది చిత్రాలు నిర్మించనున్నట్లు దత్ వెల్లడించారు. శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
చిరంజీవి, నాగార్జున, మహేశ్బాబు, ఎన్టీఆర్, నాని వంటి హీరోలతో భారీ సినిమాలు తీయనున్నట్లు అశ్వినీ దత్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవితో అశ్వనీదత్ మరుపురాని ఎన్నో హిట్ సినిమాలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత 'ఖైదీ నంబర్ 150'తో చిరు రీ ఎంట్రీ ఇవ్వడం, ఇక ముందు కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన నేపథ్యంలో మెగాస్టార్ 151వ సినిమా ఎవరితో చేస్తారు?
అనే చర్చ మొదలైంది. ఖైదీ నిర్మాత రాంచరణే చిరు 151వ సినిమానూ నిర్మిస్తారని, ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహిస్తారని తెలిసింది. అశ్వనీ దత్ ప్రణాలిక అమలైతే గనుక వైజయంతి బ్యానర్లోనే చిరు 152వ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







