ఇంగ్లాండ్ పై విజయభేరి మోగించిన భారత్

- January 29, 2017 , by Maagulf
ఇంగ్లాండ్ పై విజయభేరి మోగించిన భారత్

 


ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టీ20 మ్యాచ్‌‌ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. కోహ్లసేన 5 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. దీంతో ఫిబ్రవరి 1న జరగబోయే మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌కు కూడా టెన్షన్ పెరిగింది. మైదానంలో అందరూ ఉత్కంఠతో చూశారు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 16 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌ను వేసిన బూమ్రా మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు.
 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com