తెలుగు వైద్యుడికి పురస్కారం...
- January 29, 2017
వెన్నెముక వ్యాధి పరిశోధనకు గుర్తింపు
హైదరాబాద్: వృద్ధుల్లో వంకర తిరిగిన వెన్నెముకను సరిచేయడం, వంపు వల్ల నరాల మీద కలిగే ఒత్తిడిని తగ్గించడం.. తదితర అంశాల ప్రాతిపదికన తెలుగు యువ వైద్యుడి పరిశోధన పత్రానికి పురస్కారం లభించింది. అత్యంత చిన్నగాటుతో నిర్వహించే ఈ శస్త్రచికిత్స ద్వారా వెన్ను బాధల నుంచి విముక్తి కావచ్చని పరిశోధన పత్రంలో వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నరేశ్బాబు నేతృత్వంలో డాక్టర్ అరుణ్కుమార్ అధ్యయనం చేశారు. డాక్టర్ రాజు కూడా ఈ బృందంలో సభ్యులు.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నాలుగు రోజులుగా జరుగుతున్న వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుల జాతీయ సదస్సు ముగింపు రోజైన ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ రామ్చద్దా చేతుల మీదుగా యువ పరిశోధకుడి విభాగంలో అరుణ్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం మూడు పురస్కారాలివ్వగా మిగిలిన రెండింటిని దిల్లీ వైద్యులు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









