తెలుగు వైద్యుడికి పురస్కారం...

- January 29, 2017 , by Maagulf
తెలుగు వైద్యుడికి పురస్కారం...

వెన్నెముక వ్యాధి పరిశోధనకు గుర్తింపు 
హైదరాబాద్‌: వృద్ధుల్లో వంకర తిరిగిన వెన్నెముకను సరిచేయడం, వంపు వల్ల నరాల మీద కలిగే ఒత్తిడిని తగ్గించడం.. తదితర అంశాల ప్రాతిపదికన తెలుగు యువ వైద్యుడి పరిశోధన పత్రానికి పురస్కారం లభించింది. అత్యంత చిన్నగాటుతో నిర్వహించే ఈ శస్త్రచికిత్స ద్వారా వెన్ను బాధల నుంచి విముక్తి కావచ్చని పరిశోధన పత్రంలో వెల్లడించారు. కిమ్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ నరేశ్‌బాబు నేతృత్వంలో డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధ్యయనం చేశారు. డాక్టర్‌ రాజు కూడా ఈ బృందంలో సభ్యులు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నాలుగు రోజులుగా జరుగుతున్న వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుల జాతీయ సదస్సు ముగింపు రోజైన ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ రామ్‌చద్దా చేతుల మీదుగా యువ పరిశోధకుడి విభాగంలో అరుణ్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం మూడు పురస్కారాలివ్వగా మిగిలిన రెండింటిని దిల్లీ వైద్యులు దక్కించుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com