చేపల మార్కెట్‌లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!

- July 19, 2026 , by Maagulf
చేపల మార్కెట్‌లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!

కువైట్ సిటీ: కువైట్ ఫుడ్ మరియు న్యూట్రిషియన్ అథారిటీ (PAFN) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో చేపల మార్కెట్‌లో నిర్వహించిన తనిఖీల్లో 3.2 టన్నులకు పైగా వినియోగానికి అనర్హమైన చేపలను స్వాధీనం చేసుకుంది. తనిఖీల సందర్భంగా మొత్తం 3 టన్నులు 237 కిలోల చేపలు కుళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటి సహజ రంగు, ఆకారం, వాసన పూర్తిగా మారిపోవడంతో పాటు దుర్వాసన వస్తున్నట్లు వెల్లడించారు. ఈ చేపలను వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు బాధ్యులపై ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పీఏఎఫ్‌ఎన్ వెల్లడించింది. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా స్వాధీనం చేసుకున్న చేపలను నిబంధనల ప్రకారం పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయంపై ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com