చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- July 19, 2026
కువైట్ సిటీ: కువైట్ ఫుడ్ మరియు న్యూట్రిషియన్ అథారిటీ (PAFN) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో చేపల మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో 3.2 టన్నులకు పైగా వినియోగానికి అనర్హమైన చేపలను స్వాధీనం చేసుకుంది. తనిఖీల సందర్భంగా మొత్తం 3 టన్నులు 237 కిలోల చేపలు కుళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. వాటి సహజ రంగు, ఆకారం, వాసన పూర్తిగా మారిపోవడంతో పాటు దుర్వాసన వస్తున్నట్లు వెల్లడించారు. ఈ చేపలను వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులపై ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు పీఏఎఫ్ఎన్ వెల్లడించింది. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా స్వాధీనం చేసుకున్న చేపలను నిబంధనల ప్రకారం పూర్తిగా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయంపై ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







