రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- July 19, 2026
రిఫా: బహ్రెయిన్లోని సదర్న్ మునిసిపాలిటీ నిర్వహించిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' కార్యక్రమం మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. రిఫాలోని ఓయాసిస్ మాల్లో వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సదర్న్ మునిసిపల్ కౌన్సిల్, ఓయాసిస్ మాల్ సహకారంతో నిర్వహించారు.
చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, ప్రజా పరిశుభ్రత, వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ అలవాట్లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ పోటీలు, చిత్రలేఖనం, రంగులద్దే కార్యక్రమాలు, బొమ్మలాటలు, ఫేస్ పెయింటింగ్, ఒరిగామి కళా ప్రదర్శనలు, బెలూన్ల పంపిణీ వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.
వీటితోపాటు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా అండ్ సెక్యూరిటీ కల్చర్ డైరెక్టరేట్, సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ సహకారంతో అవగాహన సదస్సులు, వర్క్షాప్లు కూడా ఏర్పాటు చేశారు. జూలై 13న బహ్రెయిన్ ప్రముఖ నటుడు బస్సామ్ అలీ నిర్వహించిన ఆటలు, బహుమతుల కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం వినోదంతో పాటు విద్యను అందించింది. అలాగే, పర్యావరణ పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, సుస్థిరతపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించింది. అలాగే పర్యావరణ బాధ్యత కలిగిన సమాజ నిర్మాణానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







