రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- July 19, 2026
రిఫా: బహ్రెయిన్లోని సదర్న్ మునిసిపాలిటీ నిర్వహించిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' కార్యక్రమం మూడో ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. రిఫాలోని ఓయాసిస్ మాల్లో వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సదర్న్ మునిసిపల్ కౌన్సిల్, ఓయాసిస్ మాల్ సహకారంతో నిర్వహించారు.
చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, ప్రజా పరిశుభ్రత, వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ అలవాట్లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ పోటీలు, చిత్రలేఖనం, రంగులద్దే కార్యక్రమాలు, బొమ్మలాటలు, ఫేస్ పెయింటింగ్, ఒరిగామి కళా ప్రదర్శనలు, బెలూన్ల పంపిణీ వంటి వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు.
వీటితోపాటు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా అండ్ సెక్యూరిటీ కల్చర్ డైరెక్టరేట్, సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ సహకారంతో అవగాహన సదస్సులు, వర్క్షాప్లు కూడా ఏర్పాటు చేశారు. జూలై 13న బహ్రెయిన్ ప్రముఖ నటుడు బస్సామ్ అలీ నిర్వహించిన ఆటలు, బహుమతుల కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం వినోదంతో పాటు విద్యను అందించింది. అలాగే, పర్యావరణ పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, సుస్థిరతపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించింది. అలాగే పర్యావరణ బాధ్యత కలిగిన సమాజ నిర్మాణానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







