రేపట్నుండే ఏటీఎం నుంచి ఎంతైనా డ్రా చేసుకోవచ్చు..
- January 31, 2017
పెద్ద నోట్ల రద్దు తరువాత ఏటీఎంలో డ్రా చేసుకునే డబ్బులపై పరిమితి విధించారు. అయితే మద్య మద్య సవరణలు చేస్తూ ఆఖరిగా ఎంతైనా డ్రా చేసుకోవచ్చంటూ ఆర్బీఐ ప్రకటించింది. కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులకు, ఓవర్ డ్రాప్ట్ ఖాతాదారులకు క్యాష్ విత్డ్రా నిబంధనలు వర్తించవని తెలియజేసింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి1, 2017 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మాత్రం ప్రస్తుత పరిమితి యధాతదంగా వుంటుందని తెలియజేసింది. అయితే భవిష్యత్తులో సేవింగ్స్ ఖాతాదారులకు కూడా నిబంధనల్లో మార్పులు చేస్తామని తెలిపింది. ఇప్పటికే సేవింగ్స్ బ్యాంకు ఖతాదారులు వారానికి 24 వేలు తీసుకునే ఏర్పాటు వుంది. ముందు ముందు మరిన్ని సడలింపులు వుండబోతున్నాయంటుంది ఆర్బీఐ.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







