విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు...
- February 01, 2017
దుబాయ్: సౌదీ రాకుమారుడు తన సత్తా ఏమిటో చూపించడంతో విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు.
సౌదీ రాకుమారుడు ఒక్కోడేగకు ఒక సీటు చొప్పున 80 సీట్లు కొని వాటిని తరలించారు. విమాన సిబ్బంది ఈ డేగల కళ్లకు గంతలు కట్టి, ప్రత్యేక ఏర్పాట్లతో ఒక్కోదాన్ని ఒక్కోసీటులో కుర్చోబెట్టారు.
రెడిట్ అనే వెబ్ సైట్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. సౌదీ రాకుమారుడు డేగల కోసం 80 టిక్కెట్లు కొన్నారు. ఈఫోటోలను విమానం ఫైలెట్ అయిన నా స్నేహితుడు పంపాడు అంటూ రెడిట్ వెబ్ సైట్ పోస్టు చేసింది. డేగ యూఏఈ జాతీయ పక్షి అనే విషయం తెలిసిందే.
ఖలీజ్ టైమ్స్ పత్రిక సైతం సౌదీ రాకుమారుడు డేగలను విమానంలో తరలించారు అనే వివరాలు వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









