విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు...

- February 01, 2017 , by Maagulf
విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు...

దుబాయ్: సౌదీ రాకుమారుడు తన సత్తా ఏమిటో చూపించడంతో విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు.
సౌదీ రాకుమారుడు ఒక్కోడేగకు ఒక సీటు చొప్పున 80 సీట్లు కొని వాటిని తరలించారు. విమాన సిబ్బంది ఈ డేగల కళ్లకు గంతలు కట్టి, ప్రత్యేక ఏర్పాట్లతో ఒక్కోదాన్ని ఒక్కోసీటులో కుర్చోబెట్టారు.
రెడిట్ అనే వెబ్ సైట్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. సౌదీ రాకుమారుడు డేగల కోసం 80 టిక్కెట్లు కొన్నారు. ఈఫోటోలను విమానం ఫైలెట్ అయిన నా స్నేహితుడు పంపాడు అంటూ రెడిట్ వెబ్ సైట్ పోస్టు చేసింది. డేగ యూఏఈ జాతీయ పక్షి అనే విషయం తెలిసిందే.
ఖలీజ్ టైమ్స్ పత్రిక సైతం సౌదీ రాకుమారుడు డేగలను విమానంలో తరలించారు అనే వివరాలు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com