మరింత సులభంకానున్న పాస్పోర్టు సేవలు
- February 01, 2017
పాస్పోర్టు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. పాస్పోర్టు పొందాలంటే ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇకపై ప్రధాన తపాలా కార్యాలయాల్లో కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
* జవాన్లు, సైనికాధికారులు ఆన్లైన్ ద్వారా రైలు టికెట్లు కొనుక్కునేందుకు వీలుగా ''కేంద్రీకృత రక్షణ ప్రయాణ వ్యవస్థ'ను అభివృద్ధి చెసినట్లు విత్తమంత్రి తెలిపారు. టికెట్ల కోసం సైనికాధికారులు రైల్వే వారెంట్ పట్టుకుని క్యూలో నిల్చుని ఇబ్బండి పడాల్సిన అవసరం ఇంక ఉండదన్నారు.
* రక్షణరంగ పింఛనర్ల కోసం ఇంటర్నెట్ ఆధారిత సమగ్ర పింఛను పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వ్యవస్థ పింఛను ప్రతిపాదనలు అందుకుని చెల్లింపులు జరుపుతుందన్నారు. ఫలితంగా .. రక్షణ రంగ పింఛనుదార్ల ఇబ్బందులు తీరుతాయని జైట్లీ వెల్లడించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







