దారితప్పిన విమానం, తృటిలో తప్పిన పెను ప్రమాదం
- February 01, 2017
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం వెళ్లవలసిన ఇండిగో విమానం ఒకటి విమానాశ్రయంలో దారి తప్పింది. అప్పటికే ఆ మార్గంలో జెట్ ఎయిర్వేస్ విమానం నిలిచి ఉంది. సకాలంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తం చేయడంతో ముప్పును నివారించగలిగారు. ఇండిగో విమానం 6ఇ 719కు 28వ రన్ వే కేటాయించారు. 'సి' లేన్ ద్వారా ఆ విమానం రన్వేపైకి రావాలి. రన్వేను దాటి డబ్ల్యూ లేన్లోకి వెళ్లిపోయినట్లు కమాండర్ గుర్తించారు. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా అప్రమత్తం చేయడంతో కమాండర్ విమానాన్ని తక్షణం నిలిపివేశాడు. మంచు కారణంగా సరిగా కనిపించకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఇండిగో చెబుతుండగా, రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సంఘటనతో పలు విమానాలు గంట పాటు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







