10న విడుదల 'ఇకసెలవు' సినిమా...
- February 02, 2017
ఖమ్మం : గ్రీన్సన్ ఇన్నోవేటివ్స్, జైహిత ఆర్ట్స్ సమర్పణలో నిర్మించిన 'ఇక సెలవ్' చిత్రం పదో తేదీన రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత గన్నవరపు చంద్రశేఖర్ తెలిపారు. నగరంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 'ఇక సెలవ్' చిత్రం ఖమ్మంలో 50 శాతం చిత్రీకరించారని, మిగిలిన భాగం హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో చిత్రీకరించామని పేర్కొన్నారు. ఈ చిత్రం హీరోగా సాయి రవి, హీరోయిన్గా దీప్తి నటించినట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ఎక్కువగా జిల్లాకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు డి.
నాగరాజు, సహనిర్మాతలు రవి, పేర్యానాయక్, కళాకారులు కిరణ్, రంగరాజు, లాల్జాన్పాషా, రామారావు, సతీష్, రాజేశ్వరరావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









