5 దేశాలపై నిషేధం విధించిన కువైట్
- February 02, 2017
పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాల వారిపై కువైట్ నిషేధం విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే కువైట్ కూడా ఐదు దేశాలపై ఆంక్షలు విధించింది. ఈ ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని వెల్లడించింది. అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులు వలస వస్తారనే ఆందోళనతో ఈ చర్యలు తీసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. అయితే అమెరికా కంటే ముందుగానే కువైట్ సిరియా దేశీయులపై నిషేధం విధించింది. కువైట్ 2011లోనే సిరియన్లకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









