సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఘాజి'
- February 02, 2017
రానా, తాప్సీ, కే.కే మేనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఘాజి'. 1970 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికెట్ అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఘాజి చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్తో పాటు సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. రానా, తాప్సీల అద్భుతమైన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫిబ్రవరి 17న ఘాజి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.' అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









