నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష దేశ బహిష్కరణ...
- February 03, 2017
దోహా : మాదక ద్రవ్యాల విక్రయిస్తున్న నేపాలీయునికి మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం దేశ బహిష్కరణను ఆ నిందితునికి దోహా క్రిమినల్ కోర్ట్ విధించింది. అంతే కాక ఆ నిందితుని నేరానికి జరిమానా గా 200,000 క్యూ ఆర్ చెల్లించాలని ఆదేశించింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత వినియోగంకు మరియు వ్యాపారమునకు 5 కిలోల యాంఫేటమైన్ మాత్రలు కలిగి ఉన్నట్లు తేలింది. రహస్య మూలాల ప్రకారం ఆ వ్యక్తి దేశం లో అక్రమ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు అధికారులు సమాచారం అందుకొని అతన్ని పెట్టుకొనేందుకు వాలా పన్నారు . దీని ప్రకారం, ఒక రహస్య పోలీసు 950 క్యూ ఆర్ వెచ్చించి నిందితుని వద్ద యాంఫేటమైన్ మాత్రలు కోసం అతడిని సంప్రదించారు. అదే సమయంలో పోలీసులు ఆకస్మికంగా ప్రతివాది పై దాడి చేసి అరెస్టు చేశారు. ఆ నిందుతుని ఇంటి వద్ద సోదాలు జరపగా మరింత పరిమాణంలో మాదక ద్రవ్యాలు దొరికినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







