సీబీఎస్ఈ అంతర్జాతీయ విద్యాప్రణాళికని నిలిపివేయనున్న ఇండియన్ స్కూల్ బోర్డు
- February 05, 2017
మస్కట్:ఇండియన్ స్కూల్ బోర్డు 2017-18 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ-ఐ (సీబీఎస్ఈ అంతర్జాతీయ) పాఠ్యప్రణాళిక నిలిపివేయాలని నిర్ణయం తీసుకొన్నారు భారతీయ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదలవుతుంది. ప్రస్తుతం తీసుకొన్ననిర్ణయంతో భారతదేశంలో దాదాపు 50 పాఠశాలలు మరియు బహరేన్, యుఎఇ, సింగపూర్, జపాన్ మరియు మలేషియాతో సహా భారతదేశం వెలుపల ఉన్న 26 పాఠశాలలో ఈ నూతన మార్పు ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒమన్ లో కేవలము ఇండియన్ స్కూల్ ఘుబ్రా మాత్రమే ప్రస్తుతం సీబీఎస్ఈ-ఐ పాఠ్యాంశాలను బోధిస్తుంది.వాడి కబీర్ లో 2017 లో ఇండియన్ స్కూల్ ప్రాంగణాన్ని ప్రారంభించింది ఇక్కడ కొత్త సీబీఎస్ఈ-ఐ పాఠ్యఅంశాలు ఉంటాయని అందరు భావించారు, భారతదేశంలో సీబీఎస్ఈ (సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్) జనవరి 31వ తేదీన ఒక పత్రాన్నివిడుదల చేసింది.భారతదేశంలోనూ వెలుపల ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు ఈ సూచన వర్తిస్తుందని సీబీఎస్ఈ-ఐ పాఠ్యాంశాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారత బోర్డు అంతర్జాతీయ కోర్సులకు సమానంగా ఒక పాఠ్య ప్రణాళిక కలిగి ఉండాలని లక్ష్యంతో 2010 లో సీబీఎస్ఈ-ఐ ప్రారంభించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







