సీబీఎస్ఈ అంతర్జాతీయ విద్యాప్రణాళికని నిలిపివేయనున్న ఇండియన్ స్కూల్ బోర్డు
- February 05, 2017
మస్కట్:ఇండియన్ స్కూల్ బోర్డు 2017-18 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ-ఐ (సీబీఎస్ఈ అంతర్జాతీయ) పాఠ్యప్రణాళిక నిలిపివేయాలని నిర్ణయం తీసుకొన్నారు భారతీయ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదలవుతుంది. ప్రస్తుతం తీసుకొన్ననిర్ణయంతో భారతదేశంలో దాదాపు 50 పాఠశాలలు మరియు బహరేన్, యుఎఇ, సింగపూర్, జపాన్ మరియు మలేషియాతో సహా భారతదేశం వెలుపల ఉన్న 26 పాఠశాలలో ఈ నూతన మార్పు ఎంతో ప్రభావితం చేస్తుంది. ఒమన్ లో కేవలము ఇండియన్ స్కూల్ ఘుబ్రా మాత్రమే ప్రస్తుతం సీబీఎస్ఈ-ఐ పాఠ్యాంశాలను బోధిస్తుంది.వాడి కబీర్ లో 2017 లో ఇండియన్ స్కూల్ ప్రాంగణాన్ని ప్రారంభించింది ఇక్కడ కొత్త సీబీఎస్ఈ-ఐ పాఠ్యఅంశాలు ఉంటాయని అందరు భావించారు, భారతదేశంలో సీబీఎస్ఈ (సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్) జనవరి 31వ తేదీన ఒక పత్రాన్నివిడుదల చేసింది.భారతదేశంలోనూ వెలుపల ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు ఈ సూచన వర్తిస్తుందని సీబీఎస్ఈ-ఐ పాఠ్యాంశాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారత బోర్డు అంతర్జాతీయ కోర్సులకు సమానంగా ఒక పాఠ్య ప్రణాళిక కలిగి ఉండాలని లక్ష్యంతో 2010 లో సీబీఎస్ఈ-ఐ ప్రారంభించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









