బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా...
- February 08, 2017
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అల్లుడు బంగారం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం బోయపాటి ఒక పాటను సిల్వర్ స్ర్ర్కీన్ పై భారీ స్థాయిలో ఆవిష్కరించాలనే ఆలోచనలో ఉన్నాడట. 400 మంది డాన్సర్స్ ఈ పాటలో పాల్గొననున్నారని అంటున్నారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. 'సరైనోడు' తరువాత బోయపాటి చేస్తోన్న ఈ సినిమాతో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిట్ పడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







