బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా...
- February 08, 2017
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'అల్లుడు బంగారం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం బోయపాటి ఒక పాటను సిల్వర్ స్ర్ర్కీన్ పై భారీ స్థాయిలో ఆవిష్కరించాలనే ఆలోచనలో ఉన్నాడట. 400 మంది డాన్సర్స్ ఈ పాటలో పాల్గొననున్నారని అంటున్నారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. 'సరైనోడు' తరువాత బోయపాటి చేస్తోన్న ఈ సినిమాతో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిట్ పడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







