నేడు ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే.. 'ఒకే ఒక్కరికి' మాత్రమే అనుమతి.. ఆయనెవరో..?
- September 17, 2015
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన 66వ పడిలోకి అడుగుపెట్టారు. గతేడాది ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి జన్మదినాన్ని అహ్మదాబాద్లోని తన తల్లి హీరాబెన్తో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక జన్మదినం సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోని మోడీ, యథావిధిగా రోజువారీ అధికారిక కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అయితే, తన పుట్టినరోజున తన అధికారిక నివాసంలో ఒక్కరిని మాత్రమే మోడీ ఆహ్వానించారు. మిగిలిన ఏ ఒక్కరికి కూడా అపాయింట్ ఇవ్వలేదు. ఆ 'ఒకే ఒక్కరు' ఎవరనే ఆసక్తి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా సదరు వ్యక్తి పేరు, ఇతర వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. ఈ ఒక్క వ్యక్తిని మోడీ ఆహ్వానించడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. అది 2000 సంవత్సరం. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మోడీ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ, అశోకా రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ చిన్న గదిలో ఉండే మోడీ కూర్చొనివుండే మోడీని.. ఏ ఒక్కరూ పట్టించుకునేవారే కాదట. ఆ యేడాది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అక్కడ పనిచేసే ఓ వ్యక్తి మోడీ వద్దకు వచ్చి, బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పి నోరు తీపి చేశాడట. అయితే ఆ వ్యక్తికి ఇచ్చేందుకు మోడీ వద్ద కేవలం రూ.2 ఉన్నాయట. దీంతో "నా వద్ద రెండు రూపాయలే ఉన్నాయి. ఏం కొనివ్వమంటావు?" అని మోడీ ఆ వ్యక్తిని అడిగారు. "రాబోయే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పదవిలోకి వెళతారు. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి చాలు. నాకేమీ ఇవ్వొద్దు"అని బదులిచ్చాడట. ఆ మరుసటి యేడాదే గుజరాత్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ను తప్పించి.. సీఎంగా నరేంద్ర మోడీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఆ మరుసటి ఏడాది (2002)లో మోడీ తన జన్మదినం సందర్భంగా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుని తన ఇంటికి పిలిపించుకుని అతడితో కలిసి భోజనం చేశారట. అప్పటి నుంచి ఏటా ఆ వ్యక్తిని మోడీ తన జన్మదినం రోజున కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశాన్ని మోడీ కల్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాగుల్ఫ్.కాం వారి జన్మదిన శుభాకాంక్షలు..!!
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







