కువైట్‌ వాసికి కేటీఆర్‌ ఆపన్న హస్తం

- February 08, 2017 , by Maagulf
కువైట్‌ వాసికి కేటీఆర్‌ ఆపన్న హస్తం

విదేశాలకు వలసవెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపట్ల మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కువైట్‌లో కేసుల్లో ఇరుక్కొని జైలు జీతం గడుపుతున్న నిజామాబాద్‌ జిల్లా వాసి ప్రశాంత్‌కు మంత్రి కేటీఆర్‌ సాయం చేశారు. ప్రశాంత్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, అక్రమ కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీఏడీ ఎన్ఆర్ఐ అధికారులు, కువైట్ అధికారులను సంప్రదించి ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.అనంతరం ప్రశాంత్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com