స్వైన్ ఫ్లూ లక్షణాలేంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...
- February 08, 2017
స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే స్థానిక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
పిల్లలకు జ్వరం తగ్గిన వెంటనే బడికి పంపకుండా ఒకటి, రెండు రోజులు ఇంట్లోనే ఉంచడం మంచిది. స్వైన్ ప్లూ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రోజుకు పది గ్లాసుల నీరు సేవించండి. దీని మూలంగా శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. దీని మూలంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువసార్లు చేతుల్ని శుభ్రం చేసుకోండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు కచ్చితంగా అడ్డం పెట్టుకోవాలి. మాస్కులు వాడటం మంచిది. అలాగే రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. దీనితో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారంలో విటమిన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







