దలైలామా పర్యటన నేడు అమరావతిలో...
- February 08, 2017
అమరావతి: బౌద్ధమత పరమాచార్యులు దలైలామా గురువారం అమరావతిలో పర్యటించనున్నారు.స్థానిక బౌద్ధ స్తూపానికి సంబంధించిన వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన రాతిపేటికలకు పూజలు చేసి, స్తూప ప్రదక్షిణలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభంకానుంది. దలైలామాతోపాటు మరో 12 మంది బౌద్ధ గురువులు పూజా క్రతువులో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత చేపట్టేందుకు దలైలామా ముఖ్య రక్షణ అధికారి దోన్సెన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పాసుర్ వాంగ్చుక్ బుధవారం అమరావతి చేరుకున్నారు. గుంటూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దారు పి.భాస్కరరావు, స్తూప ప్రాంగణం పర్యవేక్షకులు సాయితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









