దలైలామా పర్యటన నేడు అమరావతిలో...

- February 08, 2017 , by Maagulf
దలైలామా పర్యటన నేడు అమరావతిలో...

అమరావతి: బౌద్ధమత పరమాచార్యులు దలైలామా గురువారం అమరావతిలో పర్యటించనున్నారు.స్థానిక బౌద్ధ స్తూపానికి సంబంధించిన వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన రాతిపేటికలకు పూజలు చేసి, స్తూప ప్రదక్షిణలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభంకానుంది. దలైలామాతోపాటు మరో 12 మంది బౌద్ధ గురువులు పూజా క్రతువులో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత చేపట్టేందుకు దలైలామా ముఖ్య రక్షణ అధికారి దోన్‌సెన్‌, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పాసుర్‌ వాంగ్‌చుక్‌ బుధవారం అమరావతి చేరుకున్నారు. గుంటూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దారు పి.భాస్కరరావు, స్తూప ప్రాంగణం పర్యవేక్షకులు సాయితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com