దలైలామా పర్యటన నేడు అమరావతిలో...
- February 08, 2017
అమరావతి: బౌద్ధమత పరమాచార్యులు దలైలామా గురువారం అమరావతిలో పర్యటించనున్నారు.స్థానిక బౌద్ధ స్తూపానికి సంబంధించిన వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన రాతిపేటికలకు పూజలు చేసి, స్తూప ప్రదక్షిణలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభంకానుంది. దలైలామాతోపాటు మరో 12 మంది బౌద్ధ గురువులు పూజా క్రతువులో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత చేపట్టేందుకు దలైలామా ముఖ్య రక్షణ అధికారి దోన్సెన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పాసుర్ వాంగ్చుక్ బుధవారం అమరావతి చేరుకున్నారు. గుంటూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దారు పి.భాస్కరరావు, స్తూప ప్రాంగణం పర్యవేక్షకులు సాయితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









