దలైలామా పర్యటన నేడు అమరావతిలో...
- February 08, 2017
అమరావతి: బౌద్ధమత పరమాచార్యులు దలైలామా గురువారం అమరావతిలో పర్యటించనున్నారు.స్థానిక బౌద్ధ స్తూపానికి సంబంధించిన వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన రాతిపేటికలకు పూజలు చేసి, స్తూప ప్రదక్షిణలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమం ప్రారంభంకానుంది. దలైలామాతోపాటు మరో 12 మంది బౌద్ధ గురువులు పూజా క్రతువులో పాలుపంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత చేపట్టేందుకు దలైలామా ముఖ్య రక్షణ అధికారి దోన్సెన్, ఆయన వ్యక్తిగత కార్యదర్శి పాసుర్ వాంగ్చుక్ బుధవారం అమరావతి చేరుకున్నారు. గుంటూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దారు పి.భాస్కరరావు, స్తూప ప్రాంగణం పర్యవేక్షకులు సాయితో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







