అఫ్జల్ గురు టెన్షన్.. కశ్మీర్లో కట్టడి
- February 09, 2017
శ్రీనగర్: చాలాకాలం తర్వాత కశ్మీర్లో పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించి పరిమితులు విధించారు. పార్లమెంటుపై దాడికి కారణమైన అఫ్జల్ గురు చనిపోయిన రోజు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీనగర్, షోపియాన్ తదితర ప్రాంతంలో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చేసే చర్యల్లో భాగంగానే తాము ఈ పనిచేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోపక్క.. సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే బలగాలను మోహరించి మార్చ్లు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని పెట్రోల్ బంక్లు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఈ సందర్భంగా మూసి ఉంచారు. భారత పార్లమెంటుపై దాడికి పాల్పడిన అఫ్జల్ గురును ఢిల్లీలోని తిహార్ జైలులో 2013 ఫిబ్రవరి 9న ఉరితీసి అక్కడే పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









