చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం
- September 17, 2015
భారీ భూకంపం ఒకటి చిలీని వణికించేస్తోంది. రిక్టర్ స్టేల్పై 8.3గా నమోదయ్యింది. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనం బెంబేలెత్తిపోయారు. అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఇదిలా ఉండగానే సునామీ హెచ్చరికలతో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వాల్ పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే ప్రమాదముందని సునామీ హెచ్చరికల జారీ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు ఇళ్ళలో ఉండలేక బయటకు వెళ్లలేక నడి రోడ్లపైనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







