ఒమాన్ కార్మికులకు ర్యాడిసన్ అండ్ ర్యాడిసన్ బ్లూ హోటల్స్ వారి వారి సహాయం
- September 17, 2015
శ్రామికులకు రోజువారీ అవసరమైన వస్తువులను అందించే ర్యాడిసన్ అండ్ ర్యాడిసన్ బ్లూ హోటల్స్ వారి కార్యక్రమం - 'పార్క్ ఇన్' లేదా 'ద బాక్స్ అప్పీల్' ను మళ్లీ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం 40,000 పెట్టేలను సేకరించి, పంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. హోటల్ వారి నుండి ఖాళీ పెట్టేలనుతీసుకుని, వాటిని టీ-షర్ట్, క్యాప్, డిస్పొజబుల్ రేసర్, షేవింగ్ క్రీమ్, డీయోడరెంట్, టూత్బ్రష్, టూత్పేస్ట్, ట్యాల్కమ్ పౌడర్, చిన్న హాండ్ టవల్, దువ్వెన, ఆంటీ-బ్యాక్టీరియల్ సోప్ అండ్ ష్యాoపూ లతో నింపి తిరిగి ఇవ్వాలని వారు ఒమాన్ దేశ వాసులకు వారు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కంపెనీలు మరియు ప్రైవేటు సంస్థలు అన్నీ తమ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయని పార్క్ ఇన్ హోటెల్, మస్కట్ మరియు పార్క్ ఇన్ హోటెల్ అండ్ రెసిడెన్స్, దక్మ్ ల క్లస్టర్ జనరల్ మానేజర్ రబీ జెయిన్ తెలిపారు. 2008 సంవత్సరంలో మొదలైన నాటినుండి 90,000 పెట్టేలను పంచిపెట్టామని, సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా పాల్గొంటున్న దక్షణాఫ్రికాతో సహా మధ్య ప్రాచ్యంలోని బహ్రైన్, లెబెనన్, కేటార్, ఈజిప్ట్, ఒమన్ అండ్ ద యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ల లోని 24 హోటళ్లు పాల్గొంటున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







