భారీకాయురాలైన ఈజిప్టు మహిళ కార్గో విమానంలో వస్తోంది...
- February 10, 2017
ముంబయి : ప్రపంచంలోనే అత్యంత బరువు గల మహిళగా పేరొందిన ఈజిప్టుకు చెందిన ఈమన్ అహ్మద్ బేరియాట్రిక్ శస్త్రచికిత్స కోసం శనివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ముంబయికు రానున్నారు. ఈజిప్టుకు చెందిన సరకులు రవాణా చేసే ఎయిర్ బస్ లో ఈమెను ప్రత్యేకంగా తీసుకురానున్నారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల బరువు పెరిగి మంచానికే పరిమితమైన ఈమన్ అహ్మద్ కు సైఫీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. అత్యంత భారీకాయురాలైన ఈమన్ కు చికిత్స చేసేందుకు ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని నిర్మించారు. డాక్టర్ లక్డావాలా పర్యవేక్షణలో వైద్యుల బృందం ఈమెకు చికిత్స చేయనుంది. ఆరునెలల పాటు ఈమన్ ముంబయిలో ఉండి చికిత్స పొందుతుందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
ఈమన్ కు వైద్యం చేయడంలో సాయమందించాలని లక్డావాలా చేసిన వినతిపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









