భారీకాయురాలైన ఈజిప్టు మహిళ కార్గో విమానంలో వస్తోంది...
- February 10, 2017
ముంబయి : ప్రపంచంలోనే అత్యంత బరువు గల మహిళగా పేరొందిన ఈజిప్టుకు చెందిన ఈమన్ అహ్మద్ బేరియాట్రిక్ శస్త్రచికిత్స కోసం శనివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ముంబయికు రానున్నారు. ఈజిప్టుకు చెందిన సరకులు రవాణా చేసే ఎయిర్ బస్ లో ఈమెను ప్రత్యేకంగా తీసుకురానున్నారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల బరువు పెరిగి మంచానికే పరిమితమైన ఈమన్ అహ్మద్ కు సైఫీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. అత్యంత భారీకాయురాలైన ఈమన్ కు చికిత్స చేసేందుకు ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని నిర్మించారు. డాక్టర్ లక్డావాలా పర్యవేక్షణలో వైద్యుల బృందం ఈమెకు చికిత్స చేయనుంది. ఆరునెలల పాటు ఈమన్ ముంబయిలో ఉండి చికిత్స పొందుతుందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
ఈమన్ కు వైద్యం చేయడంలో సాయమందించాలని లక్డావాలా చేసిన వినతిపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







