భారీకాయురాలైన ఈజిప్టు మహిళ కార్గో విమానంలో వస్తోంది...
- February 10, 2017
ముంబయి : ప్రపంచంలోనే అత్యంత బరువు గల మహిళగా పేరొందిన ఈజిప్టుకు చెందిన ఈమన్ అహ్మద్ బేరియాట్రిక్ శస్త్రచికిత్స కోసం శనివారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ముంబయికు రానున్నారు. ఈజిప్టుకు చెందిన సరకులు రవాణా చేసే ఎయిర్ బస్ లో ఈమెను ప్రత్యేకంగా తీసుకురానున్నారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల బరువు పెరిగి మంచానికే పరిమితమైన ఈమన్ అహ్మద్ కు సైఫీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. అత్యంత భారీకాయురాలైన ఈమన్ కు చికిత్స చేసేందుకు ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని నిర్మించారు. డాక్టర్ లక్డావాలా పర్యవేక్షణలో వైద్యుల బృందం ఈమెకు చికిత్స చేయనుంది. ఆరునెలల పాటు ఈమన్ ముంబయిలో ఉండి చికిత్స పొందుతుందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
ఈమన్ కు వైద్యం చేయడంలో సాయమందించాలని లక్డావాలా చేసిన వినతిపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







