ఖైరతాబాద్ వినాయకునికి గవర్నర్ దంపతుల తొలిపూజలు !

- September 17, 2015 , by Maagulf
ఖైరతాబాద్ వినాయకునికి గవర్నర్ దంపతుల తొలిపూజలు !

తెలంగాణలకు తలమానికమైన ఖైరతాబాద్ వినాయకుడు కోలువైనాడు.. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు తొలిపూజలు జరిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు.. చవితి ఉత్సవాలను ప్రారంభించారు. సతీసమేతంగా ఖైరతాబాద్ వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైరతాబాద్ విఘ్నేశ్వరునికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని.. ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ భక్తి ప్రపత్తులతో వినాయకున్ని పూజిస్తున్నారని అన్నారు. అంతే కాదు హైదరాబాద్ లో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉండాలని భారత దేశ ఖ్యాతిని నలు దిశలా వెలిగేలా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో గణేశుడికి వారు కొత్త వస్త్రాలు కూడా సమర్పించారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా జీవించేలా చూడాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నానని తెలిపారు. గణేశ్ ఉత్సవాలను ప్రారంభించేందుకు వచ్చిన నరసింహన్ దంపతులను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఘనంగా సత్కరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com