ముగ్గురు బహ్రెయిన్ తీవ్రవాద అనుమానితులు సౌదీ అరేబియాలో పట్టివేత ...
- February 11, 2017
మనామా: తీవ్రవాదం కేసులకు సంబంధించి ముగ్గురు బహ్రెయిన్ అనుమానితులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేశారు ఈ విషయాన్ని సౌదీ మీడియా శనివారం నివేదించారు. గత నెలలో అరెస్ట్ కాబడిన 85 మంది బహ్రయినీయులలో అనుమానితుల జాబితాలో వీరు సైతం ఉండటంతో అదుపులోనికి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ఈ తీవ్రవాద అనుమానితులకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడి చేయకుండా ఒక నివేదిక విడుదల చేశారు. ఈ అనుమానితులలో అత్యధిక శాతం మంది సౌదీ జాతీయులు ఆ తర్వాత పాకిస్తానీ ,యెమెన్ మరియు సిరియన్ దేశాలకు చెందిన అనుమానితులు ఉన్నట్లు వివరించారు. అయితే, ఈ బహ్రయినీయులను వేర్వేరు తేదీల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుబడిన నిందితులలో ఓ అనుమానిత బహ్రేయినీ వ్యక్తి సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో గతంలోనే ఆ వ్యక్తి పేరుని చేర్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యక్తి ఆచూకీ చెబితే గత అక్టోబర్ 1 మిలియన్ (100,000 బి డి ) ఒక బహుమతి సైతం ప్రకటించారు. పట్టుబడిన మరుసటి రోజు అనుమానితుడు గురించి సమాచారాన్ని బహ్రెయిన్ బహిర్గతం చేసింది. ఆ అనుమానిత నిందితుడు నాలుగు సంవత్సరాల క్రితమే బహ్రెయిన్ నుంచి పారిపోయాడని బహ్రేయినీ అధికారులు స్పష్టీకరించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







