ఇంటర్‌సెప్టర్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం...

- February 11, 2017 , by Maagulf
ఇంటర్‌సెప్టర్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం...

ఇంటర్‌సెప్టర్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం
గీత దాటే శత్రు క్షిపణులు ఇక తునాతునకలే..
4 అగ్ర దేశాల సరసన భారత.. మోదీ అభినందన
బాలాసోర్‌, ఫిబ్రవరి 11: బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌)కు చెందిన అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి ఇంటర్‌సెప్టర్‌ మిస్సైల్‌ను శనివారం ఉదయం 7 గంటల 45 నిమిషాలకు విజయవంతంగా పరీక్షించింది. ఈ తరహా మిస్సైల్‌ కల్గిఉన్న ఐదో దేశంగా అవతరించింది. ఈ క్షిపణి ద్వారా గగనతల భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని డీఆర్‌డీవో తెలిపింది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి పర్రికర్‌ శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి పీడీవీ మిషన్‌ అని నామకరణం చేశామని డీఆర్‌డీవో అధికారి ఒకరు తెలిపారు. భూ వాతావరణం నుంచి 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలనూ ఛేదించగలగడం ఈ మిస్సైల్‌ ప్రత్యేకత అన్నారు. 2000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను ఇది ఛేదించగలదు. కాగా, క్షిపణి పరీక్ష విజయవంతంపై డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బదావున్‌లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు సర్జికల్‌ దాడులకు ఆధారాలు చూపమన్నట్లుగా, ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందనడానికి రుజువులు అడుగుతాయేమోనని ఎద్దేవా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com