ఇంటర్సెప్టర్ మిస్సైల్ పరీక్ష విజయవంతం...
- February 11, 2017
ఇంటర్సెప్టర్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
గీత దాటే శత్రు క్షిపణులు ఇక తునాతునకలే..
4 అగ్ర దేశాల సరసన భారత.. మోదీ అభినందన
బాలాసోర్, ఫిబ్రవరి 11: బాలాసోర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)కు చెందిన అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఇంటర్సెప్టర్ మిస్సైల్ను శనివారం ఉదయం 7 గంటల 45 నిమిషాలకు విజయవంతంగా పరీక్షించింది. ఈ తరహా మిస్సైల్ కల్గిఉన్న ఐదో దేశంగా అవతరించింది. ఈ క్షిపణి ద్వారా గగనతల భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని డీఆర్డీవో తెలిపింది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి పర్రికర్ శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి పీడీవీ మిషన్ అని నామకరణం చేశామని డీఆర్డీవో అధికారి ఒకరు తెలిపారు. భూ వాతావరణం నుంచి 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలనూ ఛేదించగలగడం ఈ మిస్సైల్ ప్రత్యేకత అన్నారు. 2000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను ఇది ఛేదించగలదు. కాగా, క్షిపణి పరీక్ష విజయవంతంపై డీఆర్డీవో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు.
ఉత్తరప్రదేశ్లోని బదావున్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు సర్జికల్ దాడులకు ఆధారాలు చూపమన్నట్లుగా, ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందనడానికి రుజువులు అడుగుతాయేమోనని ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







