ఇండో - నేపాల్ సరిహద్దు మూసివేత
- February 13, 2017
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దును మూసివేసినట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. యూపీ రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 15న జరగనున్నాయి.
అదే రోజున శాసనసభకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన రోజు రాత్రి 7 గంటలకు సరిహద్దును తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే సరిహద్దును మూసివేసినట్లు వారు పేర్కొన్నారు.
నేపాల్ లోని కంచన్ పూర్ జిల్లాలో బెల్దాండి, త్రిభువన్ బస్తీ లలోని సరిహద్దులను మూసివేసినట్లు కంచన్ పూర్ డీఎస్పీ నైన్ సింగ్ కర్కీ తెలిపారు. ఎన్నికల సమయంలో సరిహద్దును మూసివేయడం సాధారణమేనని, సంఘ విద్రోహక శక్తులను అరికట్టేందుకే బోర్డర్ ను మూసివేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







