ప్రపంచ పర్యాటక దినోత్సవం-2017 (WTD )నిర్వహణను చేజిక్కించుకున్న కతార్
- September 17, 2015
'స్థిరమైన పర్యాటక రంగం-అభివృద్ధికి మార్గం' అనే నినాదంతో జరగబోయే 2017 సంవత్సరపు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించే అవకాశాన్ని కతార్ చేజిక్కించుకుంది! మెడెలిన్ లోని కొలంబియన్ సిటీలో జరిగిన 21 వ యునైటెడ్ నేషన్స్ వల్డ్ టూరిజమ్ ఆర్గనైజెషన్ (UNWTO) వారి వోటింగ్ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న వేర్వేరు ఖండాలలో జరుపుకొనబడే ప్రపంచ పర్యాటక దినోత్సవం, అంతర్జాతీయంగా జరుపుకొనే అతిపెద్ద పర్యాటక ఉత్సవం అన్న సంగతి తెలిసిందే;
కతార్ పర్యాటక రంగం , 2030 సంవత్సరానికల్లా అంతర్జాతీయ స్థాయిలో దూసు కెళ్ళాలనే లక్ష్యంతో నేషనల్ టూరిజమ్ సెక్టర్ స్ట్ర్యాటజీ ప్రణాళికను రచిస్తోందని కేటార్ టూరిజమ్ ఆధారిటీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ డైరెక్టర్ - సైఫ్ అల్-కువారి తెలిపారు. కతార్లో WTD 2017 నిర్వహణ, ఆ రంగంలో తాము సాధించిన విజయాలకు సరైన సమయంలో లభించిన ఒక చక్కని వేదిక ఔతుందని, ఇకపై సాధించబోయే వాటికీ ప్రేరణ ఔతుందని ఆయన విశ్లేషించారు. సాంఘిక, ఆర్ధిక హద్దులను అధిగమించి, అభివృద్ధిని ప్రోత్సహించే అపురూప లక్షణం పర్యాటక రంగానికుండని ద UNWTO సెక్రెటరీ జనరల్ డా. తలెబ్ రిఫయి తెలియజెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







