'తెలుగు కళాసమితి' ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వినాయకచవితి వేడుకలు
- September 18, 2015







బహ్రెయిన్ లో తెలుగు కళాసమితి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయకుడికి పూజలు చేసేందుకు వచ్చిన భక్తులతో ప్రాంగణంలో సందడి నెలకొంది కన్నులపండుగగా తెలుగు వారు అంతా ఒక చోట ఏకమై పూజ కార్యక్రమాన్ని తిలకించారు.ఈ కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు అన్ని ఏర్పాటులు చెసారు. అలాగే అధ్యక్షులు మోహన్ మురళీధర్ గారు మాట్లాడుతూ ఈ పూజ కార్యక్రమము లో పాల్గున్న ప్రతి ఒక్క తెలుగువారి కి వందనం అభివందనం తెలిపారు. వినాయక చవితి తెలుగు వారు ప్రతి పని ముందు మొదట పూజగా చేస్తారు అన్నారు .మన అందరికి ఎటువంటి విఘ్నాలు కలగా కుండా చూడాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తున్నాను అన్నారు. ఉపా ధ్యక్షులు రాజశేఖర్ గారు మాట్లాడుతూ తెలుగు వారు అంతా కలసి ఇంకా ఎన్నో పండుగలు జరుపు కోవాలన్నారు. ఈ కార్య క్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్నిఏర్పాటులు చేసిన కార్యవర్గ సభ్యులు ని ప్రత్యేకముగా అభినందించారు.ఈకార్యక్రమములో కార్యవర్గసభ్యులు అనిల్ గారు మరియు సూర్య,గంగాసాయన్న ,రమణ, శ్రీరాం కుటుంబ సమేతముగా పూజా కార్యక్రమము లో పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







