విజయవాడ లో భారీ 'విఘ్ననాధుడు'
- September 17, 2015
ఇప్పటి వరకు విజయవాడలోముందు ఎప్పుడూ లేని విధంగా ఒక గణపతి సేవా సంస్థ 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఖైరతాబాద్ వినాయకుడుకి షాక్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు పొడుగు 59 అడుగులు అయితే విజయవాడ వినాయకుడు 63 అడుగులుగా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మరొక కొత్త విషయం ఏమిటంటే ఈ వినాయక విగ్రహ కమిటీలో 63 మంది కార్య నిర్వహణా సభ్యులు ఉంటే 63 కిలోల బరువు గల లడ్డూతో 63 రోజుల వ్యవధిలో ఈ వినాయక విగ్రహాన్ని రూపొందించడం రికార్డు. ఈ విగ్రహాన్ని ప్రతిరోజూ రెండులక్షల మంది దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. నిన్న మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ మీడియాలో కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా వినాయకుడి మండపాలకు భక్తులు ఖర్చు పెట్టే ఖర్చు 20 వేల కోట్లు ఉంటుందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది శాతం దాకా గణపతి మండపాల సంఖ్య పెరుగుతోంది అంటే దేశంలో వినాయకుడి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది..
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







