విజయవాడ లో భారీ 'విఘ్ననాధుడు'
- September 17, 2015
ఇప్పటి వరకు విజయవాడలోముందు ఎప్పుడూ లేని విధంగా ఒక గణపతి సేవా సంస్థ 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఖైరతాబాద్ వినాయకుడుకి షాక్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు పొడుగు 59 అడుగులు అయితే విజయవాడ వినాయకుడు 63 అడుగులుగా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మరొక కొత్త విషయం ఏమిటంటే ఈ వినాయక విగ్రహ కమిటీలో 63 మంది కార్య నిర్వహణా సభ్యులు ఉంటే 63 కిలోల బరువు గల లడ్డూతో 63 రోజుల వ్యవధిలో ఈ వినాయక విగ్రహాన్ని రూపొందించడం రికార్డు. ఈ విగ్రహాన్ని ప్రతిరోజూ రెండులక్షల మంది దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. నిన్న మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ మీడియాలో కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా వినాయకుడి మండపాలకు భక్తులు ఖర్చు పెట్టే ఖర్చు 20 వేల కోట్లు ఉంటుందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది శాతం దాకా గణపతి మండపాల సంఖ్య పెరుగుతోంది అంటే దేశంలో వినాయకుడి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది..
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







