రద్దయిన నోట్ల మార్పిడి: ఎన్నారైలకు గడువు పెరిగే అవకాశం
- February 15, 2017
భారతదేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కరెన్సీ రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎన్ఆర్ఐల కోసం జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. అయితే ఈ డెడ్లైన్ని సమీప భవిష్యత్తులో పెంచే అవకాశం ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ హోమి ఫిరోజ్ రనినా చెప్పారు. నవంబర్ 9 నుంచి 30 డిసెంబర్ వరకు విదేశాల్లో ఉన్నవారు మార్చ్ 31 వరకు రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటినుంచి (నవంబర్ 8) విదేశాల్లోనే ఉన్నవారు జూన్ 30 వరకు రద్దయిన నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించారు. మోడర్న్ ఎక్స్ఛేంజ్ కంపెనీ నిర్వహించిన ఈవెంట్లో హోమి ఫిరోజ్ రనినా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నకిలీ నోట్లు, నల్లధనం రూపంలో నడవకుండా ఉండేందుకే కరెన్సీ రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా ఈ ఈవెంట్లో ఇండియా అంబాసిడర్ టు ఒమన్ ఇంద్రా మణి పాండే తదితరులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









